
గాసిప్స్

అనంతపురం జిల్లా తాడిపత్రి కి చెందిన సాత్విక్ రెడ్డి గూగుల్లో ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచాడు. న్యూయార్క్లోని Stony Brook Universityలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాత్విక్, అమెరికాలోని కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అతని తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సాత్విక్ రెడ్డికి సంవత్సరానికి రూ.2.25 కోట్ల జీతం లభించనుంది. ఈ విజయంతో తాడిపత్రి యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతపురం జిల్లా నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వంటి మరో ప్రతిభావంతుడు ప్రపంచ టెక్ రంగంలో అడుగుపెట్టడం గర్వకారణం.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!