

స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ–కామర్స్, అగ్రిగేటర్ సంస్థలకు చెందిన డెలివరీ వర్కర్లు తమ హక్కుల సాధన కోసం డిసెంబర్ 25, 2025న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. డిసెంబర్ 31, 2025 న మరోసారి అఖిల భారత సమ్మె నిర్వహించనున్నారు.
తగ్గుతున్న ఆదాయం, అసురక్షిత పని పరిస్థితులు, 10 నిమిషాల డెలివరీ పేరుతో పెరిగిన ప్రమాదకర ఒత్తిడి, అన్యాయమైన ఐడీ బ్లాకింగ్, సామాజిక భద్రత లేకపోవడం వంటి కీలక సమస్యలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నారు. రోజుకు ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పటికీ, డెలివరీ వర్కర్లకు తగిన వేతనం, భద్రత, గౌరవం, ఉద్యోగ భద్రత లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయమైన వేతనాలు, పారదర్శక ఇన్సెంటివ్ విధానం.
ప్రమాదకరమైన 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలి.
ఇష్టానుసార ఐడీ బ్లాకింగ్ను నిలిపివేయాలి.
సురక్షిత పరికరాలు, ప్రమాద బీమా సహాయం.
నిరంతర పని హామీ.
గౌరవప్రదమైన వ్యవహారం.
తప్పనిసరి విశ్రాంతి విరామాలు.
యాప్, టెక్నికల్ సమస్యలకు సరైన సహాయం.
ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా లాభాలు కల్పించాలి.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
గిగ్ వర్కర్ల హక్కులను రక్షించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని చట్టపరమైన భద్రత, సామాజిక రక్షణ కల్పించాలని డెలివరీ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!