
గాసిప్స్

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని జలమండలి ప్రకటించింది. ఈనెల 3 ఉదయం 10 గంటల నుంచి జనవరి 4 తెల్లవారుజామున 4 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి తెలిపింది. సింగూరు ప్రాజెక్ట్ ఫేజ్ – 3 ప్రధాన పైప్లైన్లో భారీ లీకేజీలు ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు.
పెద్దపూర్ – సింగపూర్ మధ్య గల పైప్లైన్కు అత్యవసర మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో మాదాపూర్, కొండాపూర్, బాలానగర్, మూసాపేట, కేపిహెచ్బీ, ఫతేనగర్, మియాపూర్, హఫీజ్పేట్, ప్రగతినగర్, బీహెచ్ఈఎల్, చందానగర్, హెచ్సీయూ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!