
రాజకీయాలు

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు గోవిందా తన జీవితంలోని భావోద్వేగ ఘట్టాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి నిర్మలా దేవి 1996లో మరణించడం తనను తీవ్రంగా కుంగదీసిందని చెప్పారు. ఆమె లేకుండా జీవితం ఎలా కొనసాగించాలో అర్థం కాక, కొంతకాలం తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఆ బాధను తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించానని గోవిందా వెల్లడించారు. ఆ సమయంలో నర్మదా నది వద్దకు వెళ్లగా, ఒక సాధువు తనను అడ్డుకున్నారని చెప్పారు. ఆ ఘటన తనలో మార్పు తీసుకువచ్చి, తన పిల్లల కోసం బతకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 10 నుంచి 15 రోజుల్లో ఆ ఆలోచనల నుంచి పూర్తిగా బయటపడ్డానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!