

శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి వచ్చిన ఓ అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ సమయంలో శర్వానంద్ నటించిన ఒక భావోద్వేగ సన్నివేశాన్ని చూసి తాను కట్ చెప్పడం కూడా మర్చిపోయానని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. గత పదేళ్లలో శర్వానంద్ చేసిన అత్యుత్తమ నటనల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు.
ఆ సన్నివేశం పూర్తయ్యాక సెట్స్లో ఉన్న 200 మందికి పైగా యూనిట్ సభ్యులు చప్పట్లతో అభినందించడంతో పాటు భావోద్వేగానికి గురైనట్లు సంపత్ నంది తెలిపారు. తన కెరీర్లో ఇలాంటి అనుభూతి చాలా అరుదుగా ఎదురైందని పేర్కొన్నారు. ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు అదే భావోద్వేగాన్ని అనుభవిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!