

మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి పరిరక్షణ, విస్తరణతో పాటు రాష్ట్ర ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో గత 30 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఈ బ్లాక్ను సింగరేణి పొందింది.
తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్లు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి తెలిపారు. మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్లో 120 మిలియన్ టన్నుల నాణ్యమైన జీ-8 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి భద్రత లభించడంతో పాటు మణుగూరు ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!