

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో దూసుకెళ్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సూర్య కెరీర్లో మరో విజయంగా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లోనూ తన సత్తా చాటుతోంది. ఉత్తర అమెరికాలో ఏకంగా 2 మిలియన్ యూఎస్ డాలర్ల గ్రాస్ మార్క్ను దాటేసింది. దీంతో అక్కడ ఈ చిత్రం మరో కీలక మైలురాయిని అందుకుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ నుంచే అధిక వసూళ్లు రావడం విశేషంగా మారింది.
ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణతో వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు సూర్య నటన కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఉత్తర అమెరికాలో ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్ను అందుకోవడంతో చిత్ర బృందం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఈ విజయానికి మరింత బలం చేకూరుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!