

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తన తాజా చిత్రం ‘మకుటం’ కోసం నిర్వహించిన కీలక చిత్రీకరణ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు. గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో సాగిన ఈ షూటింగ్ ముగిసినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ షెడ్యూల్ పూర్తవడంతో చిత్ర బృందం చెన్నైకి తిరిగి చేరుకుంది. ముఖ్యంగా 1990ల నేపథ్యంలోని క్లిష్టమైన సన్నివేశాలను ఈ దశలో చిత్రీకరించినట్లు విశాల్ వెల్లడించారు.
ఈ రెండు వారాల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, పట్టుదలతో షూటింగ్ పూర్తి చేశానని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అహంకారం లేకుండా వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసిన నటి అంజలి, సినిమాటోగ్రాఫర్ అభినందన్, బృందా మాస్టర్, దర్శకత్వ బృందం, మండే ఎండలను లెక్కచేయకుండా పనిచేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు అండగా నిలిచిన కాబోయే జీవిత భాగస్వామి సాయిధన్సికకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.
ఈ రోజు నుంచి చెన్నైలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని విశాల్ వెల్లడించారు. త్వరలోనే జీ.వి. ప్రకాశ్ కుమార్ సంగీతంలో సినిమా తొలి సింగిల్ విడుదల కానుందని, అభిమానులు సిద్ధంగా ఉండాలని సూచించారు. విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో ‘మగుడం’ పేరుతో రూపొందుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!