

హీరోయిన్ శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసిందనే వార్తలు వెలువడడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఆమె విద్యా విజయాన్ని అభిమానులు ప్రశంసిస్తుండగా, అంత బిజీ సినీ షెడ్యూల్ మధ్య ఇది ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సమాచారం ప్రకారం, శ్రీలీల 2020 లో డి.వై. పాటిల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరింది. అయితే ఆ తరువాత ప్రతి ఏడాది రెండు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ, షాప్ ఓపెనింగ్స్, విదేశీ ఈవెంట్లు, నిరంతర ప్రయాణాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కోర్సును ఎలా పూర్తి చేసిందనే సందేహం వ్యక్తమవుతోంది.
భారతదేశంలో ఎంబీబీఎస్ చదువు కఠినమైన అటెండెన్స్ నిబంధనలు, క్లినికల్ పోస్టింగ్స్, ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్ వంటి తప్పనిసరి ప్రమాణాలతో ఉంటుంది. క్రమశిక్షణతో సాధ్యమేనని కొందరు భావిస్తుండగా, మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో సాయి పల్లవి, మానుషి చిల్లర్, అదితి గోవిత్రికర్, అదితి శంకర్ వంటి నటీమణులు ముందుగా వైద్య విద్య పూర్తి చేసి తర్వాత సినిమాల్లోకి వచ్చిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ వివాదానికి పూర్తి స్పష్టత ఇవ్వాల్సింది శ్రీలీలేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!