

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల 'తేరే ఇష్క్ మే', 'కాక్టెయిల్ 2' వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఆమె ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ 'నో ఎంట్రీ సీక్వెల్'లో నటిస్తున్నారు. ఈ విజయాలను ఆస్వాదిస్తున్న కృతి తాజాగా తన భవిష్యత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై రొటీన్, సేఫ్ జోన్ పాత్రలకు దూరంగా ఉండి సరికొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ, సైకో పాత్రలో నటించడం తన కోరికల జాబితాలో అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. 'అబ్సెషన్' సిరీస్ చూసిన తర్వాత తన ఆలోచనా విధానం మారిందని, విభిన్నమైన పాత్రలను ఎంచుకోవాలనే ఆసక్తి పెరిగిందని చెప్పారు. హాలీవుడ్ నటి జెండయా నటన తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. తెరపై కొత్త వ్యక్తిత్వాలను ఆవిష్కరించడం నటులకు ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని కృతి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!