

స్టార్ హీరో సూర్య తన కెరీర్లో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం కేటాయించడం కంటే.. కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుని, పరిమిత బడ్జెట్, తక్కువ వ్యవధిలో షూటింగ్ పూర్తి చేసేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ‘కంగువ’ వంటి భారీ చిత్రానికి సుదీర్ఘ సమయం కేటాయించిన సూర్య.. ఇకపై సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా వరుసగా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహం కోలీవుడ్తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్గా సినిమాలు విడుదల కావడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2026లో సూర్య నుంచి మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ‘కరుప్పు’ రూరల్ యాక్షన్ డ్రామాగా మే నెలలో విడుదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీన్’ యాక్షన్ కామెడీ/కాప్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మూడు సినిమాలు ఒకే క్యాలెండర్ ఏడాదిలో విడుదలైతే.. సూర్య కెరీర్లో ఇది ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!