

గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో వరుస పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ తారలు తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్బై చెబుతూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో, ‘ఎంత అందంగా ఉన్నావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ జియా శంకర్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో యూట్యూబర్ అభిషేక్ మల్హన్తో ఆమె రిలేషన్పై రూమర్లు వినిపిస్తున్న వేళ, వాటికి చెక్ పెడుతూ జియా తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె తన కాబోయే భర్త కరణ్ను పరిచయం చేస్తూ, ప్రపోజల్కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
తన జీవితంలో నిజమైన ప్రేమ అనుకోని సమయంలో వచ్చిందని, ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని జియా పేర్కొన్నారు. కరణ్ తనకు అండగా నిలిచి కష్టకాలంలో కూడా నవ్వించిన వ్యక్తి అని తెలిపారు. దూరంగా ఉన్నప్పటికీ అతనితో మాట్లాడే ప్రతి క్షణం తనకు ఎంతో హాయిగా అనిపించేదని చెప్పారు. కరణ్ తనకు ప్రాణ స్నేహితుడు, జీవిత భాగస్వామి అని చెబుతూ, అతనితో జీవితాన్ని గడపడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని భావోద్వేగంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!