టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో పసుపు చీరలో పిస్టల్ పట్టుకున్న ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ను ప్రియాంక చోప్రా పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో లాస్ ఏంజిల్స్కు బయల్దేరిన ప్రియాంక, ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సమయంలో హైదరాబాద్లో ప్రసిద్ధమైన ‘బన్ మస్కా’ చిత్రాన్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
‘హైదరాబాద్ నుంచి ఒక భాగాన్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. త్వరలో మళ్లీ కలుద్దాం. నేను నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ప్రమోషన్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్తున్నాను. ఆ కార్యక్రమాలు ముగిసిన వెంటనే తిరిగి వారణాసి సెట్స్లో జాయిన్ అవుతాను’ అని ఆమె పోస్ట్లో పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ప్రియాంక చోప్రా ఒక భారతీయ సినిమాలో నటించడం ఈ చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకువస్తోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!