

సినీ పరిశ్రమలో ఒకప్పుడు నటన, విజయాలు, ప్రేక్షకాదరణ మాత్రమే నటీనటుల స్థాయిని నిర్ణయించేవి. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం ప్రభావం పెరగడంతో సోషల్ మీడియా ఉనికి కూడా కీలకంగా మారిందని ప్రముఖ నటి తాప్సీ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రశాంతత కోసం కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వృత్తిపరమైన అవసరాల కారణంగా మళ్లీ చురుకుగా మారాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
బ్రాండ్లు, సంస్థలు ఇప్పుడు నటీనటుల ఆన్లైన్ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయని తాప్సీ చెప్పారు. ఒక సెలబ్రిటీకి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, వారి పోస్టులకు ఎంత స్పందన వస్తుంది వంటి అంశాలు అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ట్రోలింగ్, విమర్శలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, ప్రస్తుత సినీ పరిశ్రమలో సోషల్ మీడియా ప్రాధాన్యతను విస్మరించలేమని ఆమె అభిప్రాయపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!