
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సెట్స్ను భారత క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించడం చిత్రబృందానికి ప్రత్యేక ఉత్సాహాన్ని తెచ్చింది. టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో భాగమైన తిలక్ వర్మ షూటింగ్ స్పాట్కి వచ్చి చిత్రీకరణను పరిశీలించాడు. హై వోల్టేజ్ స్పోర్ట్స్ సీన్స్ను ప్రత్యక్షంగా వీక్షించిన అతను సినిమా టీమ్తో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
సినిమాలోని యాక్షన్తో పాటు భావోద్వేగ అంశాలు కూడా తిలక్ వర్మను ఆకట్టుకున్నాయని సమాచారం. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!