
సినిమాలు

ముడిసరుకుల ధరలు పెరగడం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగడం వంటి పరిణామాలతో దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఉత్పత్తి వ్యయాల భారం పెరుగుతోంది. దీంతో మార్జిన్లను కాపాడుకునేందుకు బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్ వంటి సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి.
జూన్ త్రైమాసికంలోనే కొన్ని ఉత్పత్తుల గ్రామేజ్ను తగ్గించడంతో పాటు మరికొన్ని ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతుండటంతో పాటు ఎల్నినో ప్రభావం కూడా వ్యయాలపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు మరో 2–5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులపై అదనపు ఖర్చు భారం పడే అవకాశం కనిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!