
.webp&w=3840&q=75)
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెల తన నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కోసం హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. తన సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుస్మిత నిర్మించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (2026) సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఆమె నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఈ విజయంతో ఉత్సాహం పొందిన సుస్మిత, సంస్థకు ఇది కొత్త అధ్యాయం అని పేర్కొన్నారు. “మరింత కృతజ్ఞతతో, నమ్మకంతో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం” అంటూ ఆఫీస్ ప్రారంభోత్సవ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
నిర్మాతగా మారకముందు సుస్మిత సినీ పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. చరణ్ నటించిన రంగస్థలం, చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా సేవలందించారు. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!