
న్యూస్

సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసలతో కపుల్ ఫ్రెండ్లీ సినిమా మరింత చర్చనీయాంశంగా మారింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటోందని ఆయన తెలిపారు. మనసుకు హత్తుకునే ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోందని చిత్రబృందాన్ని అభినందించారు.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించగా, దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. సహనిర్మాతగా అజయ్ కుమార్ రాజు పి వ్యవహరించగా, ధీరజ్ మొగిలినేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేశారు. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3.96 కోట్ల మొత్తం వసూళ్లు సాధించి ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.





.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!