

సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరును కొనసాగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ను దాటినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోనూ సినిమాకు మంచి స్పందన లభిస్తుండగా.. ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
సినిమాను వీక్షించిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సూర్య ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారని, మమిత బైజు ఎనర్జీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రశంసించారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ సన్నివేశాన్ని ఇటీవల కాలంలో చూసిన అత్యుత్తమ సన్నివేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు. వెంకీ అట్లూరి మరోసారి తనదైన రచన, కథనంతో ఆకట్టుకున్నారని అన్నారు. దీనికి స్పందించిన నిర్మాత నాగవంశీ.. కార్తికేయ ద్వారా రాజమౌళికి సినిమా చూపించి, ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని కోరారు. భావోద్వేగాలతో కూడిన కథనాన్ని కమర్షియల్ అంశాలతో మేళవించిన వెంకీ అట్లూరి శైలి సినిమాకు బలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!