
జనరల్

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్ స్టాక్ మార్కెట్లో ఘనంగా అరంగేట్రం చేసింది. ₹201 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 31.99 శాతం ప్రీమియంతో ₹265.30 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఎన్ఎస్ఈలో 31.84 శాతం ప్రీమియంతో ₹265 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బలమైన ఇన్వెస్టర్ల స్పందన నేపథ్యంలో కంపెనీ షేర్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.
₹1,700 కోట్ల విలువైన లలితా జువెలరీ ఐపీఓ ఆగస్టు 17న ప్రారంభమై 19న ముగిసింది. ఇందులో ₹1,200 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, ₹500 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈ ఐపీఓకు ఏకంగా 62.97 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది. 1985లో ప్రారంభమైన లలితా జువెలరీ మార్ట్ దక్షిణ భారత మార్కెట్పై ప్రధానంగా దృష్టి సారించి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలో స్టోర్లను నిర్వహిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!