

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే సోమవారం లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రజా విద్యకు ప్రాధాన్యం ఇచ్చి పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించారో, ప్రస్తుతం ఎన్ని పాఠశాలలకు మరమ్మతులు లేదా పూర్తిస్థాయి పునర్నిర్మాణం అవసరమో కేంద్రం వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అలాగే మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు, భర్తీ అయిన పోస్టులు, ఖాళీల వివరాలను బహిరంగపరచాలని అభిజీత్ దీప్కే కోరారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, క్రీడా సౌకర్యాలు వంటి వసతులు ఎన్ని పాఠశాలల్లో ఉన్నాయో వివరించాలని కోరారు. ఈ లేఖ రాజకీయ ఉద్దేశంతో కాదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాసినదని ఆయన స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!