

టాలీవుడ్ క్రేజీ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్టుగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓటీటీ, శాటిలైట్ డీల్ కుదిరినట్లు సమాచారం. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఎస్కేఎన్ మాట్లాడుతూ, గతంలో నాగచైతన్య నటించిన ‘తండేల్’ సినిమా హిట్ అవుతుందని చెప్పానని, అది నిజమైందని తెలిపారు. ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు చూసే అవకాశం తనకు దొరికిందని, సినిమా రిలీజ్ డేట్ తెలియకపోయినా కంటెంట్పై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అక్కినేని అభిమానుల్లోనూ సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు మరింత పెంచుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!