

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మోదీ సేవా స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజలందరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు దేశసేవ కొనసాగించాలని ఆకాంక్షించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మోదీ సేవా స్ఫూర్తి, త్యాగం, వికసిత్ భారత్ నిర్మాణం వంటి అంశాలపై తమ ఆలోచనలు పంచుకోనున్నారని చెప్పారు. ‘నమో సేవా యాత్ర’తో పాటు నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించి మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ఘనంగా జరుపుకోవాలని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!