
గాసిప్స్

‘మారి 2’లో రౌడీ బేబీ పాటతో తెగ సంచలనం సృష్టించిన ధనుష్–సాయిపల్లవి హిట్ జోడీ మళ్లీ తెరపై కనిపించనుంది. ధనుష్ హీరోగా రూపొందుతున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో సాయిపల్లవిని మరో కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే శ్రీలీల ఒక హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సాయిపల్లవి చేరికతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘‘ఆమె సౌందర్యానికి, బలానికి ప్రతీక. అందరి అభిమాన తార సాయిపల్లవికి ‘డీ 55’ ప్రాజెక్ట్లోకి స్వాగతం’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో స్వాగతం పలికారు. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!