

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘సర్దార్-2’ సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధమవుతుండగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్తో ‘కార్తి-30’ కూడా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇదే సమయంలో ‘కార్తి-31’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుందని మేకర్స్ వెల్లడించారు.
ఈ ప్రకటన సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పంచుకున్నారు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే తనకు ఇలాంటి గొప్ప అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. సినీ ప్రయాణంలో 25వ సంవత్సరంలో రూపొందుతున్న 11వ చిత్రం కావడంతో పాటు, తనకు ఎంతో ఆప్తుడైన కార్తితో కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్ను మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు. తనకు ఎప్పుడూ అండగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కొత్త ప్రయాణంలో కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ చిత్రం షూటింగ్ 2026 చివర్లో ప్రారంభం కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!