

ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,588 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి. శ్రీనివాసరావు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 17న విడుదలైన ప్రకటన ప్రకారం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
వెయ్యి డ్రైవర్ పోస్టులకు 894 మంది పురుషులు ఎంపిక కాగా, 743 శ్రామిక్ పోస్టులకు 694 మంది పురుషులు, 16 మంది మహిళలు ఎంపికయ్యారు. అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా 139 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ఎంపికైన అభ్యర్థులు అవసరమైన పత్రాలను మూడు కాపీలుగా సమర్పించి, గెజిటెడ్ అధికారి సంతకం పొందాలి. ఈ నెల 17న జిల్లా ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లలో పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తుది ఎంపిక పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలపై ఆధారపడి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!