

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రశ్నించారు. 40 ఏళ్లు దాటితే వృద్ధులుగా పరిగణిస్తారా? అలా అయితే రాష్ట్రంలోని సగం జనాభా ఆయుష్షు ముగిసినట్టేనా అని నిలదీశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శ పేరుతో జగన్ చేసిన పర్యటనను, అక్కడ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బాధితులను పక్కనబెట్టి నిందితులకు మద్దతు ఇవ్వడం జగన్ నైజమని విమర్శించారు.
సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె పలువురు నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక జీవించి ఉన్న వ్యక్తిని రికార్డుల్లో మృతుడిగా చూపించి భూమిని తన కుమారుడి పేరిట మార్చుకున్నారని ఆరోపించారు. అలాగే సీదిరి అప్పలరాజు తన కుమారుడిని కాపాడేందుకు నిరపరాధిని బలిచేయాలని చూశారని అన్నారు. ఇలాంటి వారిని జగన్ సమర్థించడం ఆయన నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!