
టెక్నాలజీ

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ను షేక్ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే పల్లె పాటలు ఇప్పుడు మిలియన్ల వ్యూస్తో నెట్టింట దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా డీజేలు, ఫంక్షన్లు, రీల్స్లో ఈ పాటల హవా విపరీతంగా పెరిగింది. యూత్ కూడా ఈ ఫోక్ బీట్స్కు బాగా కనెక్ట్ అవుతున్నారు.
తాజాగా ‘సన్న సన్న బియ్యమే’ అనే ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఎనర్జిటిక్ డ్యాన్స్తో ఈ పాటకు మరింత క్రేజ్ తెచ్చారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకున్న ఈ సాంగ్ రీల్స్లో విపరీతంగా వైరల్ అవుతోంది. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ పాట ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!