

రష్మికమందన్న తనలో ఉన్న అతిపెద్ద భయాన్ని జయించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. మైసా షూటింగ్ కోసం కొచ్చిలో గడిపిన రోజుల అనుభవాలను పంచుకుంటూ, ఎత్తులంటే ఉన్న భయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అడవులు, జలపాతాలు, ట్రెక్కింగ్లు, వర్కవుట్లు, వర్షాల మధ్య సాగిన షూటింగ్ తనకు మరపురాని అనుభూతిని ఇచ్చిందన్నారు. యాక్షన్ సీక్వెన్స్ల కోసం కఠిన శిక్షణ తీసుకుంటూ మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా షూటింగ్ కొనసాగించానని తెలిపారు.
దర్శకుడు రవీంద్ర పుల్లె గతంలో వెల్లడించిన ప్రకారం, రష్మిక ఈ చిత్రం కోసం డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకినట్లు సమాచారం. మరోవైపు ఆమె తన భర్త విజయ్దేవరకొండ తో కలిసి చేసిన ‘విరోష్’ యాడ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రకటనకు ఇన్స్టాగ్రామ్లో 9.1 మిలియన్లకు పైగా లైక్స్ రావడంతో ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన రెండో యాడ్గా నిలిచింది. ఇదే జంట గతంలో చేసిన మరో యాడ్ 11.5 మిలియన్ల లైక్స్, 104 మిలియన్ల వ్యూస్తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రణబాలి లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!