
టెక్నాలజీ

7 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతుభరోసా పథకం కింద ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆరవ విడతలో భాగంగా 92,729 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ₹354.96 కోట్లు నేరుగా జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతులకు సాగు పెట్టుబడి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
మంత్రి తుమ్మల వివరాల ప్రకారం, ఇప్పటివరకు 68.37 లక్షల మంది రైతులకు చెందిన 124.85 లక్షల ఎకరాల సాగుభూమికి మొత్తం ₹7,490.72 కోట్ల రైతుభరోసా నిధులు విడుదలయ్యాయి. రైతులకు అవసరమైన పెట్టుబడి సకాలంలో అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!