
జనరల్

రష్మిక మందన్న తన నటనపై ఉన్న నిబద్ధతను మరోసారి నిరూపించారు. ఆమె నటిస్తున్న మైసా కోసం క్లిష్టమైన స్టంట్స్ చేశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనుండగా, ఆమె చూపించే ఆవేశం, కోపం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
అతిరపల్లి జలపాతం వద్ద చిత్రీకరణ సమయంలో రష్మిక డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి గాయపడినా, విరామం తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నారు. బ్యాంకాక్లో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట శైలుల్లో కఠిన శిక్షణ తీసుకున్నారని దర్శకుడు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!