

బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్ర ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ రికార్డు స్థాయి వీక్షణలు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో నమోదైన మొత్తం వీక్షణలు నాలుగు రోజుల్లోనే 800 మిలియన్లు దాటినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ట్రైలర్లోని అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల రూపకల్పన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తుండగా, నమిత్ మల్హోత్రా భారీ వ్యయంతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్కు వస్తున్న విశేష స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, విజువల్ గ్రాండియర్తో ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!