
గాసిప్స్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సఃకుటుంబానాం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందంపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మానందం ప్రసంగం ముగించి మైక్ ఇచ్చిన వెంటనే, రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యక్తిగత జోక్కు బ్రహ్మానందం ఆశ్చర్యం, ఆగ్రహంతో వెంటనే ప్రతిస్పందించారు. “సరదాగా అన్నాను” అంటూ ఆయన కవరప్ చేసే ప్రయత్నం చేశారు.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ కాగా, నెటిజన్లు “ఎంతటి సీనియర్ అయినా స్టేజ్ మీద హద్దులు దాటొద్దు” అంటూ రాజేంద్ర ప్రసాద్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇది ఆయనకు మొదటి వివాదం కాదు – డేవిడ్ వార్నర్, అలీ, చప్పట్లు కొట్టని ప్రేక్షకులపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మళ్లీ ఇదే తప్పు రిపీట్ అవడంతో ఆయనపై విమర్శలు మరింత బలపడ్డాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!