

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం పెద్ది పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. కొంతకాలంగా భారీ బాక్సాఫీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్, ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. గతంలో వచ్చిన రంగస్థలం తరహాలోనే ప్రేక్షకులను బలంగా ఆకట్టుకునే కథ, కథనంతో పెద్దిని రూపొందించేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, స్పోర్ట్స్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.
ఇలాంటి సమయంలో పెద్ది సినిమా విడుదల తేదీ పై కొత్త అంచనాలు వినిపిస్తున్నాయి. మొదటగా మార్చి 27 న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను, షూటింగ్ ఆలస్యం కారణంగా మే 1వ తేదీకి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మే మొదటి వారంలో విడుదలైతే థియేటర్లలో మంచి వసూళ్లు సాధించవచ్చని చిత్ర బృందం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!