
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నమోదవుతున్న కొవిడ్ కేసులపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, కొవిడ్తో పాటు ఇప్పటికే ఉన్న హైబీపీ, రక్త సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యల కారణంగానే కొంతమంది మరణించారని తెలిపారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కొవిడ్ వేరియంట్ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
జూన్ 26 నుంచి జూలై 16 వరకు నాలుగు జిల్లాల్లో 12 కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ పాజిటివ్గా తేలిన నలుగురు మరణించినప్పటికీ, వారికి ముందుగా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు వివరించారు. మరో ఐదు అనుమానిత కేసుల నమూనాలను పరీక్షలకు పంపినట్లు వెల్లడిస్తూ, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!