
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా తిరుమలలో శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె, క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించి, అధికారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు.
అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా, బేడి ఆంజనేయస్వామిని కూడా దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ భుజ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఈ మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం. గతంలో తన కుమారుడు సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భంగా కూడా ఆమె తిరుమల వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!