
సినిమాలు

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. "జయ జయహే తెలంగాణ" గీతం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత కవిగా అందెశ్రీని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను, స్వాభిమానాన్ని తన అక్షరాల్లో ప్రతిబింబింపజేసిన అరుదైన సాహితీవేత్తగా ఆయనను అభివర్ణించారు.
అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, ప్రజల ఆత్మగౌరవానికి స్వరంగా నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ఆయన పేరు, రచనలు, ఉద్యమ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!