

బిహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన కొద్ది రోజులకే జన సురాజ్ పార్టీ నేత, ఎమ్మెల్యే ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో నియోజకవర్గంలోని కనీసం 10 వేల మంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. ఇందుకోసం అర్హులైన యువత సీవీలు, బయోడేటాలను తన కార్యాలయానికి పంపాలని కుటుంబాలను కోరారు. తన వృత్తిపరమైన పరిచయాల ద్వారా వారిని వివిధ కంపెనీలతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
అయితే ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ అవకాశాలకే పరిమితమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని తాను హామీ ఇవ్వలేనని తెలిపారు. బాంకీపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభ దశలోనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను తన ప్రాధాన్యతల్లో ముందుకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ప్రొఫెషనల్ నెట్వర్క్ను ఉపయోగించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!