
సినిమాలు

‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేడివేడి అన్నంలో ఐస్క్రీమ్ కలుపుకుని తినడం తనకు ఎంతో ఇష్టమని, ఈ కాంబినేషన్కు తాను పూర్తిగా అలవాటు పడిపోయానని తెలిపింది.
ఈ అలవాటు ఎలా వచ్చిందనే ప్రశ్నకు స్పందించిన మృణాల్.. తన స్నేహితుడు ఒకరు ఈ విధంగా తినడం చూసి సరదాగా ట్రై చేశానని, కానీ మొదటి సారి రుచి చూసిన వెంటనే నచ్చేసిందని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా, కొందరు అభిమానులు ఆమెను క్యూట్గా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ ఫుడ్ కాంబినేషన్ను ఊహించుకోవడమే కష్టమని కామెంట్లు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!