
.png&w=3840&q=75)
టాలీవుడ్లో పాపులర్ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న గురించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గీత గోవిందం సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సినిమాకు మొదట తననే హీరోయిన్గా సంప్రదించారని, అయితే అప్పట్లో కథ వినకముందే తాను ఆ ప్రాజెక్ట్కు నో చెప్పినట్టు లావణ్య తెలిపింది. తర్వాత కథ విన్నాక సినిమా చేయడానికి ఓకే చెప్పినా, కొన్ని అపార్థాల కారణంగా ఆ అవకాశం తన చేతుల నుంచి వెళ్లిపోయిందని వెల్లడించింది.
అదే సందర్భంలో లావణ్య మరో ఆసక్తికర వ్యాఖ్య చేస్తూ గీత గోవిందం సినిమానే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలను దగ్గర చేసింది అని తెలిపింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఈ జంటకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. తర్వాత ఇద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!