

మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, వినోదానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కమెడియన్ సత్య చేసిన కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ద్వితీయార్థంలో వచ్చే ఆయన సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని, డైలాగ్ టైమింగ్, హావభావాలతో సత్య మరోసారి మెప్పించనున్నారని తెలుస్తోంది.
తన ప్రత్యేక కామెడీ శైలితో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఈ చిత్రంలోనూ తనదైన వినోదాన్ని అందించనున్నారని సమాచారం. మరోవైపు థమన్ అందించిన నేపథ్య సంగీతం హారర్, కామెడీ అంశాలను మరింత బలంగా నిలబెట్టిందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో ఉత్కంఠను కొనసాగిస్తూ వినోదాన్ని సమతుల్యం చేసేలా సంగీతం ఉంటుందని సమాచారం. ఆగస్టు 7న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!