

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇకపై నోటీసు అందుకున్న ఓటరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా, కుటుంబంలో ఎవరైనా వయోజన సభ్యుడు సంబంధిత ఓటరు నమోదు అధికారి లేదా సహాయ ఓటరు నమోదు అధికారి ఎదుట హాజరై అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సమర్పించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. నోటీసుల పరిష్కారానికి అవసరమైన పత్రాలను స్వీకరించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు ఈ మేరకు సమాచారం అందించామని, నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని సీఈఓ సూచించారు. అలాగే ఫారం-6 దరఖాస్తుల పరిశీలన, ప్రకటన పత్రం స్వీకరణ, అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియలో భాగంగా అర్హత తేదీ 2026 అక్టోబర్ 1గా పరిగణిస్తూ పెండింగ్లో ఉన్న, భవిష్యత్తులో అందే ఫారం-6 దరఖాస్తులకు నిర్దేశిత ప్రకటన పత్రాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!