
జనరల్

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్హౌస్ పరిధిలో భూములపై రెవెన్యూ అధికారుల తొలిరోజు సర్వే పూర్తైంది. 325 సర్వే నంబర్లోని సుమారు 380 ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో ఈ సర్వే, రికార్డుల పరిశీలన చేపట్టారు.
భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు తదితర వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తొలిరోజు సర్వే పూర్తికాగా, అవసరాన్ని బట్టి తదుపరి రోజుల్లోనూ భూములకు సంబంధించిన వివరాల పరిశీలన, సర్వే కొనసాగించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!