

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా, త్వరలోనే వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా మహిళా ప్రధాన కథలు, వెబ్ సిరీస్లు, డిజిటల్ ప్రాజెక్టులపై ఆమె దృష్టి పెట్టినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా కత్రినా టీమ్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కత్రినా తన పూర్తి దృష్టిని మదర్హుడ్పైనే కేంద్రీకరించారని, ఆమె రీ ఎంట్రీపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. అలాగే ఓటీటీ ప్రాజెక్టులు లేదా కొత్త సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారాన్ని కూడా ఖండించింది. దీంతో కత్రినా త్వరలో సినిమాల్లోకి వస్తుందని ఆశించిన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!