

కంగనా రనౌత్ ఖాతాలో మరో నిరాశాజనక ఫలితం చేరింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆమె తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ బాక్సాఫీస్ వద్ద అత్యంత బలహీనమైన ఆరంభాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున దేశవ్యాప్తంగా కేవలం రూ. 1 కోటి వసూళ్లు మాత్రమే సాధించడంతో సినీ వాణిజ్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రానికి కేవలం 11 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. దీంతో ప్రేక్షకులను ఆకర్షించడంలో కంగనా ప్రభావం మరోసారి పనిచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు మనోజ్ తపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో కామా ఆసుపత్రిలో గర్భిణీలు, రోగులను కాపాడిన నర్సు అంజలి కుల్తే వీరోచిత గాథ ఆధారంగా రూపొందింది. ఒకటికొంటే ఒకటి ఉచితం టికెట్ ఆఫర్ ప్రకటించినప్పటికీ, వసూళ్లలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో కంగనా గత చిత్రం ‘ఎమర్జెన్సీ’ తరహాలోనే ఈ చిత్రం కూడా నిరాశపరిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!