
సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్, నటుడిగా కాకుండా దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ‘సిగ్మా’లో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన జాసన్ సంజయ్, చిన్నప్పటి నుంచి తన కెరీర్పై ఉన్న కలల గురించి వెల్లడించారు. మొదట పైలట్ కావాలని, ఆ తర్వాత క్రికెటర్గా రాణించాలని భావించానని చెప్పారు. అయితే 11, 12 తరగతుల్లో ఉన్నప్పుడు సినిమాపై ఆసక్తి పెరిగిందని, కాలేజీలో ఏ కోర్సు ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకునే సమయానికి దర్శకుడిగా మారాలని నిశ్చయించుకున్నానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!