

కర్ణాటక సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న బయోపిక్కు ‘ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను రష్మిక మందన్న పోషించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తి చేసినట్లు సమాచారం. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో సినిమాను గ్రాండ్గా లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ బయోపిక్కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను ‘ఎంఎస్ – తెరపై ఓ చిరస్మరణీయ వారసత్వం’ పేరుతో గ్రాండ్గా పరిచయం చేయనున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీత వారసత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ లాంచ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. తొలుత ఆమె పాత్ర కోసం సాయి పల్లవి, రుక్మిణీ వసంత్, కీర్తి సురేష్ పేర్లు వినిపించినప్పటికీ.. చివరికి రష్మికను ఎంపిక చేశారు. రష్మిక, గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్ కాంబినేషన్తో ఈ బయోపిక్పై అంచనాలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!