
సినిమాలు

మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్కి అనుకోని సమస్య ఎదురైంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ను ఈ నెల 18 నుంచి హైదరాబాద్ గగన్పహాడ్ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన నీటి అడుగు సెట్లో ప్రారంభించాలనుకున్నారు.
అయితే భారీగా శుద్ధి చేసిన నీరు అవసరం కావడంతో దాదాపు 150 ట్యాంకర్ల నీరు కావాలని చిత్ర బృందం అభ్యర్థించింది. కానీ నగరంలో వేసవి తీవ్రత, నీటి అవసరాలు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ నీటి సరఫరా సంస్థ ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో షూటింగ్లో మార్పులు లేదా వాయిదా ఉండే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!