

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ వైభవాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ చిత్రంతో ప్రత్యేక బంగారు నాణెం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే సెప్టెంబరులో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక నాణెాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సుమారు 310 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల లడ్డూ 2009లో జీఐ ట్యాగ్ను పొందిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ దివ్య ప్రసాదం ఆధ్యాత్మిక విశిష్టతను, తిరుమల క్షేత్ర వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్మారక బంగారు నాణెాన్ని తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయం భక్తుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు తిరుమల లడ్డూ చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!