

సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న #గ్లోబ్ట్రాటర్ సినిమా టైటిల్ & గ్లింప్స్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
ఇటీవలి కాలంలో పెద్ద సమూహాల కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో అభిమానుల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజమౌళి టీమ్ మరియు హైదరాబాద్ పోలీస్లు కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు.
రాజమౌళి విడుదల చేసిన వీడియోలో, “ఈ ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ కాదు. పాస్ ఉన్నవారికే ఎంట్రీ ఉంటుంది. అలాగే 18 ఏళ్ల లోపు వారు, వృద్ధులు ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని పోలీసులు ఆదేశించారు,” అని చెప్పారు.
“మన భద్రత కోసం పోలీసులు కొన్ని కఠినమైన నిబంధనలు జారీ చేశారు. వాటిని పాటించడం మన బాధ్యత,” అని రాజమౌళి వివరించారు.
విజయవాడ–హైదరాబాద్ రూట్ నుంచి వస్తున్న వారు RFC మెయిన్ గేట్కి ముందు ఎడమవైపు తిరిగి అనస్పూర్ రూట్ తీసుకోవాలి.
హైదరాబాద్–విజయవాడ వైపు నుండి ఎల్బీ నగర్ లేదా వనస్థలీపురం మార్గం ద్వారా వచ్చే వారు ఎగ్జిట్ 11 దాటి, యూ-టర్న్ తీసుకుని, సర్వీస్ రోడ్ మీదుగా సంగీ టెంపుల్ రూట్ ద్వారా చేరుకోవాలి.
గచ్చిబౌలి వైపు నుండి వస్తున్న వారు ఎగ్జిట్ 12 తీసుకుని, సర్వీస్ రోడ్ మీదుగా సంగీ రూట్ వైపు వెళ్లాలి.
ప్రతి పాస్పై QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే వీడియో ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈవెంట్ స్థలానికి వెళ్లే మార్గం వివరాలు లభిస్తాయి. “సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశాం, దయచేసి సూచనలను పాటించండి,” అని రాజమౌళి అన్నారు.
గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓపెన్ అవుతాయి. ముందుగానే రావడం ద్వారా మంచి పార్కింగ్, సీటింగ్ లభిస్తుందని చెప్పారు. “ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఈవెంట్ వెంటనే రద్దు అవుతుంది. కాబట్టి అందరం కలిసి భద్రతా చర్యలను పాటిద్దాం,” అని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (2)
Good decision..
మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి!